Breaking News

మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మూడచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి ఎల్ల అశ్విని – సంజీవులు గారి గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, మున్సిపాలిటీలో నెలకొన్న డ్రైనేజ్, విద్యుత్, తాగునీటి వంటి ప్రాథమిక సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేసే నాయకత్వం పార్టీ వద్ద మాత్రమే ఉందని అన్నారు.

మున్సిపల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం: తీన్మార్ మల్లన్న

జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం పెరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *