
భూపాలపల్లి జిల్లా కేంద్రంగా అగ్రకుల రాజకీయ ఆధిపత్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అగ్రకుల పార్టీల్లో ఉన్నప్పటికీ, వారికి రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కేవలం ఒక వర్గం చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తూ, సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వివక్షపూరిత రాజకీయాలకు భూపాలపల్లి జిల్లా ప్రజలు త్వరలోనే గట్టి సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు.

2028 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ ఏకమై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను భూపాలపల్లి జిల్లాలో గర్వంగా ఎగరవేస్తామని తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. అగ్రకుల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికి, బహుజన వర్గాల రాజకీయ హక్కులు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.ప్రజల సమస్యలపై రాజీ పడకుండా, దోపిడీ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
