- ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకుల నుండి 25 లక్షలు డిమాండ్…
- 16 లక్షలకు బేరం కుదుర్చుకున్న ఖాకీలు..
- డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకనే ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు…
- సామాన్యులకేనా లేక పోలీసులకు కూడా అవే చట్టాలా చూడాలి మరి..
సూర్యాపేట, (ప్రజా ఎన్ కౌంటర్),మే 12 :
సూర్యాపేట జిల్లాలో ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆ తర్వాత జిల్లాలో అర్హత గల డాక్టర్లు లేని పలు ప్రవేట్ ఆసుపత్రులు స్వతహాగా మూసివేగా, ఓ స్కాన్ సెంటర్ నిర్వాహకడు అర్హత లేకుండానే స్కాన్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వెలబడ్డాయి. ఈ తరుణంలోనే ఐఎంఏ డాక్టర్స్ సూర్యాపేట డిఎస్పి పార్థసారథికి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ డీఎస్పీ ఆదేశానుసారం ఈ విషయంపై విచారణ చేపట్టిన సూర్యాపేట టౌన్ సిఐ వీర రాఘవులు కేసు విషయంపై డిఎస్పి దగ్గర సెటిల్మెంట్లు చేసుకోండి అంటూ పంపించాడని ఏసిబి డిఎస్పి జగదీష్ చందర్ తెలిపారు. సోమవారం సూర్యాపేట డిఎస్పి కార్యాలయంలో రెండున్నర గంటల పాటు విచారణ చేసిన ఏసీపి అధికారులు సూర్యాపేట టౌన్సీ సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఫిర్యాదుదార్ నుండి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన పిటిషన్ మేరకు విచారణ చేసి సూర్యాపేట పట్టణ సిఐ రాఘవులు, డిఎస్పి పార్థసారథిపై కేసు నమోదు చేసి కస్టడీలో పెట్టామని నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. ఈ తనికెళ్లలో నల్గొండ ఏసీబీ ఏఎస్పి కమలాకర్ రెడ్డి, నలగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, నల్గొండ రేంజ్ ఏసీబీ టీమ్ పాల్గొన్నారు.