*స్టిల్+2 అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులు
*నిత్యం సర్కిల్, పర్యవేక్షణలో ఉండవలసిన టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం…!
*టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ఏసిపి కనుసనల్లోనే నిర్మాణం…?
ప్రజా ఎన్ కౌంటర్ కుత్బుల్లాపూర్ డిసెంబర్ 18; గాజులరామారం సర్కిల్ 26 పరిధిలో అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడ0లో వెనుకంజ వేస్తున్నారు. నగరవ్యాప్తంగా అనుమతులు లేని నిర్మాణాలు కూలిపోవడమో లేక పనిచేస్తున్న కార్మికుల మృత్యువాత పడటం ప్రతిరోజు ఏదో ఒక మూలన చూస్తూనే ఉన్నాం. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వలన పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. నిరంతరం క్షేత్రస్థాయిలో వారి విధులను నిర్వర్తించాల్సిన అధికారులు బయటకు రాకుండా కార్యాలయంలోనే తాపీగా కూర్చుంటున్నట్లు ప్రజల పేర్కొంటున్నారు. గాజులరామారం బాలాజీ లేఔట్ ఓక్షిత్ ఎంక్లేవ్ ప్లాట్ 603 & 604part నెంబర్ నిర్మాణదారుడు అనుమతులకు మించి అక్రమ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సదరు నిర్మాణదారుడు పట్టణ ప్రణాళిక విభాగం నుండి Stil + 2 ( 392137/3814/GHMC/2024 )అనుమతి తీసుకొని, నిర్మనదారుడు మరో అదనంగా మరో రెండు అంతస్తు నిర్మిస్తున్నాడు. కాగాసదరునిర్మాణదారుడు టౌన్ ప్లానింగ్ అధికారులకు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు అందించినట్లు సమాచారం. ఆ ధీమాతోనే నిర్మాణదారుడు నిమ్మలంగా ఉన్నట్లు తెలుస్తుంది.
*అధికారులపై ప్రజల గుర్రు
అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయడంలో అధికారులు నువ్వేఫలమవుతున్నట్లు ప్రజల గుర్రుగా ఉన్నారు. బాధ్యత కలిగిన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అధికారులపై విమర్శలు వస్తున్నాయి. గాజులరా మారం సర్కిల్ పరిధిలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవలసిన వారు, నిర్మాణదారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున లంచాలకు అలవాటు పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వెంటనే అక్రమ నిర్మాణం పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.